తేది 26-08-15 రోజున దయామయి , ప్రేమా మూర్తి అమ్మ మధర్ ధెరీసా జన్మదిన వేడుకలను యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో తిరుమలగిరి మండలం లోని భవిత సెంటర్ ( ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ( వికలాంగులు) ) నందు వారితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేకు కటింగ్ చేసి పిల్లలకు పంచడం జరిగింది మరియు ఈ కార్యక్రమం లో ZPHS.HM ప్రభాకర్ రెడ్డి మరియు CPS.HM నర్సయ్య గార్లు చేతులమీదుగా YCSSయువచైతన్య సేవా సమితి వారు పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది . కాసేపు వారితో గడిపి వారి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు యం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మమధర్ ధెరీసా జన్మదినం సందర్భంగా ఈ వికలాంగ విధ్యార్ధులతో కలిసి అమ్మ జన్మదినం ను జరుపుకోవడం వారితో గడపడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి యం. స్వామి మరియు సభ్యులు డి . మహేష్ విష్ణు, పి. మహేష్ ప్రశాంత్ లు మరియు IERT.Teachers. మురళీధర్ రావు మరియు వాని పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)
0 comments:
Post a Comment